Tuesday, March 30, 2010

మల్లయ్యశాస్త్రి బంకుపల్లి, Mallayya Sastry Bankupalli




బంకుపల్లి మల్లయ్య శాస్త్రి ... కవి , పండితుడు ,సంస్కర్త , గాంధేయవాది , స్వాతంత్ర సమరయోధుడు .
  • జన్మ స్థలము : సింగుపురము .. శ్రీకాకులం మండళం లో
  • పుట్టినతేదీ : 29-04-1876 ,
  • మరణము : 26-09-1947 ,
రచనలు :
  • ఆంధ్ర వేదములు ,
  • అనుభూతిప్రకాశము ,
  • అస్పృశ్యత ,
  • వివాహతత్వము,
  • కొండవీటి విజయము ,
  • యక్షగాన తత్వము ,
  • భగవద్గీతా తత్వము ,
  • సాహిత్యసర్వస్వము , ... మున్నగునవి ,


కందుకూరి వీరేశలింగం విధవలకు పెళ్లిళ్లు చేస్తే దీన్ని మరింతగా సంస్కరించారు జిల్లాకు చెందిన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి. చిన్నవయస్సులో పెళ్లయి గర్భాదానం జరగకుండా విధవ అయిన కన్యలకు వివాహం జరిపించి ఆదర్శంగా నిలిచారు. జీలకర్ర, బెల్లం పెట్టి తాళి కట్టినంత మాత్రాన వివాహం జరిగినట్టు కాదని, గర్భాదానం అయితేనే వివాహం అయినట్టు అని ఆయన వాదించారు. ఈ పద్ధతి మొదటిగా ఆయన తన ఇంట్లో పాటించడంతో ఆయన్ను ఆనాడు సంఘం నుంచి వెలివేసినా మొక్కవోని ధైర్యంతో సవాల్‌ స్వీకరించి వివాహతత్వం అనే గ్రంథాన్ని రచించి చరిత్రలో చిరస్మరణీయుడయ్యారు. ఆయన కృషికి పాండిత్యానికి మెచ్చి ఇంటాక్‌ సంస్థ నాగావళి మూడో వంతెనపై విగ్రహాన్ని ప్రతిష్టించింది(06/07/2009) . అంతటి మహానీయులు ఉండడం జిల్లాకు గర్వకారణం.

  • =========================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment