Saturday, August 23, 2014

Amarapu Satyanarayana,అమరపు సత్యనారాయణ



 నాటక కళా విశారద, కళా తపస్వి బిరుదాంకితులు ప్రసిద్ధ సీనియర్ రంగస్థల నటులు అమరపు సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా రాజాంలో గురువారం 20.10.2012 న రాజాం లో కన్ను మూశారు.కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. పలు పౌరాణిక పాత్రల్లో జీవించిన ఆయన తెలుగు నాటక రంగ వికాసానికి ఎంతో కృషి చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ రంగస్థల కళల విభాగంలో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. నటనా రంగంలో అనేక మంది శిష్యులను తయారు చేసి, నాటకరంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఈ మహనీయుడు మృతి చెందడం శ్రీకాకుళం జిల్లాకు, ఆంధ్ర నాటక రంగానికి తీరని లోటు. ప్రతిష్టాత్మక బళ్ళారి రాఘవ అవార్డు గ్రహీత అమరపు సత్యనారాయణ .

అమరపు సత్యనారాయణ అప్పటి శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా పాములవలస గ్రామంలో అప్పలనాయుడు, కన్నమ్మలకు 1937 ఏప్రిల్ 12 న జన్మించారు. చిన్నతనంలో పాటలు,పద్యాలు గొంతెత్తి అందరూ వినెలా పాడేవారు. అతని కంఠ మాధుర్యాన్ని గుర్తించి పక్కి సత్యన్నారాయన అనె ఉపాధ్యాయుడు శిక్షణనిస్తే మంచి కచ్ళాఇంకారుడవుతాడని చేరదీసాడు. ఒకవైపు నాటకాల్లో అవకాశాలిస్తూ మరొకవైపు నోము సూర్యారావు వద్ద శిక్షణ యిప్పించాడు. పద్యం భావయుక్తంగా పాడటానికి సంగీతం చాలా అవసరమని అందులో శిక్షన పొందారు. శ్రావ్యమైన కంఠం,చూడచక్కని రూపం,భావాత్మక గానం ఆయనను అందరిలో మేటిగా నిలిపింది. ఆయన ఏ పాత్ర ధరించవలసి వచ్చినా ఆహార్యం మొదలుకొని అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించెవారు.నిండుతనం కోసం పరితపించెవారు.అందువల్ల ఆయన పాత్రలకి,ఆయనకు ప్రజాదరణ పెరిగింది. అపరపు సత్యనారాయణ అనేక పాత్రలు ధరించినా ఆయనకు కొన్ని పాత్రలతొ విడదీయరాని సంబంధం పెరిగింది.ముఖ్యంగా రామాంజనేయ యుద్ధంలో రాముడు, గయోపాఖ్యానం నాటకంలో కృష్ణుడు, అర్జునుడు, చింతామణి నాటకంలో బిల్వమంగళుడు పాత్రలు మంచి ఆదరణ పొందాయి. 20.10.2012 న రాజాం లో కన్ను మూశారు.


అవార్డులు,రివార్డులు,సన్మానాలు

    1960 లో ఆంధ్ర రాష్ట్ర పరిషత్ పోటీల్లో స్వర్ణ పతకం పొందారు.
    1965 లో పొద్దుటూరుకు చెందిన శ్రీ రాయన నాటక పరిషత్ వారిచే స్వర్ణ కిరీటం పొందారు.
    రూర్కెలా లోని శ్రీ వెంకటేశ్వర ఫైనాంస్ సంస్థ 'నాటక కళా విశారదా అనే బిరుదుతో సత్కరించింది.
    అప్పటి గవర్నర్ పి.సి.అలెగ్జాండర్ చేతుల మీదుగా 'రాఘవ అవార్డు ' అందుకున్నారు.
    అప్పటి సినీ నటులైన కాంతారావు,ధూళిపాళ,అల్లురామలింగయ్య,చంద్రమోహన్,రాజనాల వంటివారితో కలసి రంగస్థలం పై నటించారు.
    గయో పాఖ్యానంలో అర్జునుడు, కర్ణసందేశంలో కర్ణుడు పాత్రల సంభాషనలు రికార్డులు తయారయ్యాయి.
    వృత్తి పరంగా రాజాం నందు కళాశాల ఉపన్యాసకులుగా పనిచేసి పదవీవిరమణ పొందినా జన హృదయాలలో శాశ్వతంగా నిలిచి పోయారు.

  • ====================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Friday, October 4, 2013

Chayaraj Konkyana(writer),చాయారాజ్ కొంక్యాన (కవి , రచయిత)

  •  

  •  Courtesy with Eenadu news paper


  • విప్లవ కవి సిక్కోలు గొంతు జనసాహితీ వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ చాయారాజ్ ఈ రోజు ఉదయం 8.30 గం.ల ప్రాంతంలో శ్రీకాకుళంలో తుదిశ్వాస విడిచారు. ఆయన రచనలు శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం), గుమ్మ (కొండ కావ్యం), దర్శని (కావ్యం), నిరీక్షణ (దీర్ఘ కవిత), మట్టి నన్ను మవునంగా ఉండనీయదు (కవితా సంపుటి) బుదడు (కావ్యం). మొన్న 18న ఆయన రచన 'కారువాకి' (నవల) శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. ఇవన్నీ ఆయన ఉద్యమాలలో తనను తాను ఆవిష్కరించుకునే క్రమంలో రాసిన కవిత్వం.

    బుదడు కావ్యంలో చివరిగా చాయారాజ్ గారన్నట్టు " కవీ! మృత్యువు నీకు బంధువు, నీ కోర్కె ప్రకారం నిన్ను విశ్వ సౌందర్యంలోనికి ఒంపేస్తుంది. ఉషస్సులలో, సంజలలో, ఎండ్లల్లో వెన్నెల్లో ఇంకిపోతావు. అనంతమైపోతావు. ఎందుకూ మిగలవు. ఎవరికీ తగలవు. " మృత్యువు అతనికి ప్రియురాలు. అతడ్ని ధ్వంసం చేస్తుంది. మళ్ళీ మళ్ళీ పునర్ నిర్మిస్తుంది. ఒక అసంతృప్తి  స్థితిని సంతృప్తపరిచేందుకు - ప్రేరణ ప్రతీకార చర్యలే జనన మరణ నిజాలు".

    నిజమే. చాయారాజ్ మాస్టారుని మృత్యువు కేన్సర్ రూపంలో తనను కబళించినా మనందరిలో తన స్ఫూర్తిని మిగిల్చిన కావ్యాలాపన ద్వారా మనల్ని పునర్నిర్మించే మరో కార్యసంబంధమైన పనిలోకి ఈ మట్టిలోలోపలికి ఇంకిపోతూ ఇగిరిపోతూ అమరులయ్యారు.
  • =====================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Wednesday, March 27, 2013

Dusi Dharmarao , దూసి ధర్మారావు

  •  


  •  (Sri D.V. Dharma Rao, Lecturer Retaired, Writer & Musician, Srikakulam).

 ఇంటాక్ కన్వీనర్ దూసి ధర్మారావు మంచి కవి . శ్రీకాకుళం నాగరికత , శ్రీకాకుళం ప్రముఖులు , పర్యావరణము , విద్య ప్రాధాన్యం తదితరాల మేళవింపుతో ఎన్నో పాటలు సుమారు 200 పైగా వ్రాసారు.

services : 

Roads and Buildings Minister Dharmana Prasada Rao on Tuesday released theme song of the Dr. B.R.Ambedkar University in Hyderabad. Famous writer Dusi Dharma Rao has written the song ‘Alayam-Devalayam…Alayam-Vidyalayam' highlighting the importance of the university, according to registrar V.Krishna Mohan. Six lyric writers sent their entries and out of them, Mr. Dharmarao's song was accepted by the University Executive Council. “The song explains the culture of Srikakulam and the importance of University.”

Srikakulam Chapter INTACH
Convenor Name   :  Shri D V Dharma Rao

Address     MIG 230, APHB Colony, Opp. Zila Parishad, Srikakulam - 532001
Phone     08942-225025 (R), Mobile     09441032567
E-mail     convenor.intachsklm@gmail.com

  • ==========================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Monday, March 11, 2013

Sripada Pinakapani,శ్రీపాద పినాకపాణి


  • image : courtesy with Eenadu news paper.
 పరిచయం :
  • సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, ప్రముఖ వైద్యులు, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి శ్రీపాద పినాకపాణి 1913 ఆగస్టు 3న శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో జన్మించిరి.  శ్రీపాద పినాకపాణి బాల్యమంతా రాజమండ్రిలో గడచింది. 1957 నుంచి కర్నూలులో నివాసం ఉంటున్నారు. వైద్యాన్నివృత్తిగా, సంగీతాన్ని ప్రవృత్తిగా ఎంచుకుని రెండు రంగాల్లో విశిష్ట సేవలందించారు. ప్రభుత్వ వైద్యుడిగా 30 ఏళ్లపాటు పనిచేసిన ఆయన కర్నూలు బోధనాసుపత్రి పర్యవేక్షకులుగా సేవలందించారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే పేద రోగులకు ఉచితంగా వైద్యం చేసిన పినాకపాణి సంగీత విద్వాంసుడిగా కీర్తి సంపాదించారు. గతేడాది ఆగస్టులో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 101 సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ఘనంగా సత్కరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున గాన విద్యా వారధి పురస్కారం అందించారు.

మరణము :   కొంతకాలంగా అచేతన స్థితిలో మంచంపైనే ఉన్న ఆయన్ను ఆరోగ్యం విషమించడంతో కర్నూలులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఫిబ్రవరి 22 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(11-మార్చి-2013) సాయంత్రం 6 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

అవార్డులు.. ప్రశంసలు
డాక్టర్‌ పినాకపాణి ప్రతిభను గుర్తించిన సంగీత ప్రపంచం ఆయన్ను ఎన్నో సత్కారాలతో గౌరవించింది. ఆకాశవాణి కేంద్రాల ద్వారా తన సంగీతాన్ని ప్రజలకు చేరువచేసిన పినాకపాణి 14 సంగీత నాటక అకాడమీల నుంచి గౌరవ పురస్కారాలు పొందారు.
* 1966లో ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ ద్వారా గాన కళాప్రపూర్ణ బిరుదు, 1970లో మద్రాస్‌లోని ఇండియన్‌ ఫైన్‌ఆర్ట్స్‌ సొసైటీ నుంచి సంగీత కళాశిఖామణి అందుకున్నారు.
* 1973లో విశాఖ మ్యూజిక్‌ అకాడమీ నుంచి గానకళాసాగర బిరుదును, 1976లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సప్తగిరి సంగీత విద్వాన్‌మణి స్వీకరించారు.
* 1974లోనే తితిదే పినాకపాణిని ఆస్థాన విద్వాంసుడిగా నియమించింది. 1978 మార్చి 27న సెంట్రల్‌ సంగీత నాటక అకాడమీ 40 ఏళ్లపాటు సంప్రదాయ కర్ణాటక సంగీతానికి ఆయన చేసిన సేవలను గుర్తించింది. అద్భుతమైన కంఠస్వరం కలిగిన పినాకపాణి సంగీతాన్ని రికార్డు చేసి నేషనల్‌ ఆర్కివ్స్‌లో భద్రపరచడం ద్వారా ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చింది.
* 1983లో మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ నుంచి సంగీత కళానిధి, 1984లోఅప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌ చేతుల మీదుగా పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు.
* గాన రుషి, గాన కళాప్రపూర్ణ, సంగీత కళాశిఖామణి గానకళాసాగర, సప్తగిరి సంగీత విద్వాన్‌మణి... ఇలాంటివెన్నో.

ప్రొఫైల్  :

పేరు : డా .శ్రీపాద పినాకపాణి(Dr.Sripada Pinakapani-MD),
తల్లిదండ్రులు : జోగమ్మ, కామేశ్వరరావు,
వైద్య పట్టా : MBBS, MD-1939,
కర్నూలుకు బదిలీ : 1957,
పదవీవిరమణ : 1968,
రాసిన పుస్తకాలు: సంగీత సౌరభం, పాణినీయం, స్వరరామమ్‌, నా సంగీత యాత్ర తదితరాలు,
సతీమణి : బాలాంబ,
కుటుంబం : కామేశ్వరరావు, శ్యామ్‌కృష్ణ, రాఘవ, డాక్టర్‌ మువ్వగోపాల్‌, కుమార్తె జానకి . పెద్దకుమారుడు కామేశ్వర్‌రావు కుమార్తె చిన్మయి ప్రస్తుతం సినిమా పాటలు, డబ్బింగ్‌ కళాకారిణి.
* సంగీతం నాకు శ్రీకృష్ణభగవానుడు ఇచ్చిన వరం. పాత కాలం నాటి సంగీత విద్వాంసులు అందించిన సాహిత్యాన్ని భద్రపరచి నేటి తరాలకు అందివ్వాలి.
ఆయన వందోవసంతం సందర్భంగా  అన్న మాటలివి.

యువకుడిగా...
కొందరికే పరిమతమైన వైద్యవిద్యలో ఆయన ఎండీ చేశారు. మంచి శారీరక దృఢత్వం గల వ్యక్తి. ఇందుకు ఆయన ప్రత్యేక కసరత్తులు చేసి కండలుతిరిగిన దేహంతో యువకులకు ఆయన స్ఫూర్తి. చదువుకుంటూనే సంగీత కచేరీలు చేశారు. చదువులోనే గట్టెక్కలేక ఇబ్బందులు పడుతున్న నేటి తరానికి ఆ రోజుల్లోనే విద్యలో రాణించి... తన సంగీతాభిలాషవైపు అడుగులు వేసిన ఆయన నేటి యువతకు ఆదర్శం.

మధ్యవయస్కుడిగా
కర్నూలు సర్వజన వైద్యశాలలో వైద్యుడిగా, పర్యవేక్షకులుగా ఆయన సేవలు అందించారు. పేదల వైద్యుడిగా పేరుగాంచారు. ఎవరైనా పేదలు చికిత్సకోసం ఇంటికి వస్తే... వద్దు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మని చెప్పి ఉచిత సేవలు అందించే గొప్ప మనస్కుడు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను ఇంటికి రమ్మని అధిక రుసుం వసూలు చేసే వైద్యులకు ఆయన మార్గం అనుసరణీయం.

వృద్ధుడిగా...
1968లో పదవీవిరమణ పొందిన తర్వాత ఆయన తన దృష్టిని సంగీతంపై పెట్టారు. ఈ రంగంలో ఎవరెస్టు శిఖరాలనే అధిరోహించారు. కర్ణాటక సంగీత లోతుపాతులు పరిశీలించారు. సంగీతంపై పుస్తకాలు రాశారు. ఈ రంగంలో ఆయన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

పదవీవిరమణ పొందిన తర్వాత హాయిగా ఇంట్లో కూర్చొందాం. ఇంకేం చేయగలం? ఏం సాధించగలం? అని ఆలోచించి సగటు మనిషికి ఆయన జీవితమే పాఠం. ఆ...మనమేం చేయగలం? మనమేమి గెలవగలం? అని సరిపెట్టుకుంటున్న యువతకు ఆయన మార్గం గుణపాఠం.

పినాకపాణి కర్నూలులో నివాసం ఏర్పరుచుకోవడం ఈ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని ప్రముఖలు అంటున్నారంటే... ఆయన జీవితం నుంచి మనం ఎన్ని నేర్చుకోవచ్చు అర్థంచేసుకోండి.

మహా విద్వాంసుడు 'శ్రీపాద'
ఇటు వైద్యరంగంలోనే కాకుండా సంగీత కళా సేవ చేసిన మహా విద్వాంసుడు శ్రీపాద పినాకపాణి. ఆయన డాక్టరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి విద్వాంసులకు ఆదర్శప్రాయుడు. నేను కర్నూలులో శ్రీపాద పినాకపాణితో కలిసి సంగీత సభల్లో  పాల్గొన్నాను. దేశంలో పేరెన్నికగన్న సంగీతజ్ఞుల సరసన నిలిచి సంగీత కళా ప్రపంచంలో తనదైన బాణీలో ఖ్యాతి గడించారు.

శ్రీకాకుళం జిల్లాలో ఆయన ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలు తక్కువే. మన జిల్లాకు చెందిన శ్రీపాద చనిపోవడం జిల్లావాసులకు, సంగీతరంగానికి తీరని లోటు. - సంగీతవిద్వాంసులు బండారుచిట్టిబాబు

సంగీత స్వరం మూగపోయింది
ఓ సంగీత స్వరం మూగపోయింది. సంగీత సరస్వతి ఖిన్నురాలైంది. సంగీతకళా శిఖామణి పినాకపాణి మనజిల్లావారు కావడం మన అదృష్టం.ప్రియాగ్రహారానికి చెందిన ఆయన దేశంలో సంగీత కచేరీలు చేసి మనజిల్లా పేరును ఇనుమడింప చేశారు. డా. రమణరావు లాంటివారు ఆయనకు మంచి స్నేహితులు. గత డిసెంబరు నెలలో ఇంటాక్‌ సంస్థ తరపున శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో శ్రీపాదకు వందేళ్లు నిండిన సందర్భంగా గాయత్రీ కౌండిన్య శాస్త్రీయ సంగీత కచేరీ ఏర్పాటు చేశాం. - - దూసిధర్మారావు

  • =========================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Monday, November 19, 2012

Mojjada Mohanarao-మొజ్జాడ మోహనరావు



  •    
  •  ఓ లక్ష్యం నిర్దేశించుకొని దాన్ని సాధించే వరకు పట్టుదలతో శ్రమించడం విజయానికి ఒక మార్గమయితే తనకు ఇష్టమైన రంగంలో అవకాశాలు రానప్పుడు అందివచ్చిన వాటిని సద్వినియోగం చేసుకొని ఆ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం మరో విధానం.. మార్గమేదయినా ఎంచుకొన్న విధానంలో స్పష్టత.. ఆచరణలో చిత్తశుద్ధి ఉంటే విజయాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయనేందుకు పట్టణానికి చెందిన మొజ్జాడ మోహనరావును నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తనకిష్టమైన రంగంలో ఎదగడమే లక్ష్యంగా పొట్టచేతబట్టుకుని రాజధానిలో అడుగుపెట్టిన మోహనరావుకు మొదట్లో చేదు అనుభవాలే ఎదురయ్యాయి. అయినా నిరాశ చెందక వెనక్కు తిరిగిరాలేక ఒంటరిగానే జీవన పోరాటం సాగించాడు. ఆ దిశలో అనుకోకుండా అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అల్లుకుపోయాడు. డబ్బింగ్‌(గాత్రదానం) కళాకారుడిగా స్థిరపడ్డాడు. క్షణం తీరికలేకుండా పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. తాజాగా టీవీ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుకు సైతం ఎంపికై ఓ మైలురాయి దాటాడు.

శ్రీకాకుళంలోని బొందిలీపురం ప్రాంత వాసి రెవెన్యూశాఖలో మాజీ అధికారి మొజ్జాడ రామారావు, వరలక్ష్మిల నలుగురి సంతానంలో ఆఖరివాడు మోహనరావు. ఎం.ఎ., బి.పి.ఇడి చదువుకున్న అతను తొలిరోజుల్లో అల్లంశెట్టి చంద్రశేఖరరావు ప్రోద్భలంతో తన సాహిణి ధర్మారావు వద్ద గానంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత వివిధ ఆర్కెస్ట్రాలలో వందలాది ప్రదర్శనలిచ్చారు. అదే క్రమంలో కాకుళం సిటీకేబుల్‌లో న్యూస్‌రీడర్‌గా అవకాశం రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ రంగంలో మరింత ఎదగాలని మక్కువ పెంచుకున్నారు.

శ్రీకాకుళంలోనే ఉండిపోతే తన లక్ష్యసాధన వీలుకాదని అప్పటికి పోగేసిన మొత్తాన్ని చేత పట్టుకుని తన కలలను సాకారం చేసుకోవడానికి 2000లో రాజధానికి పయనమయ్యారు. అప్పటికే న్యూస్‌రీడింగ్‌ రంగంలో విపరీతమైన పోటీ నెలకొని ఉండడంతో అందులో అవకాశాలు క్ష్లిష్టంగా మారాయి. ఒట్టి చేతులతో వెనుక్కు వెళ్లలేక... ఇక్కడే ఉండలేక ఏం చేయాలో తేల్చుకోలేని సందిగ్ధ సమయంలో కలల రాజధాని కృష్ణానగర్‌ ఆయనకు ఆశ్రయచ్చింది. శ్రీకాకుళానికే చెందిన మరో డబ్బింగ్‌ కళాకారుడు భాస్కర్‌ మోహన్‌రావును హాస్య నటుడు మిఠాయి చిట్టికి పరిచయం చేసి ఒక అవకాశం ఇప్పించమని అభ్యర్థించారు. వాస్తవంగా డబ్బింగ్‌ చెప్పడం ఇష్టం లేకపోయినా తక్షణం పొట్ట నింపుకోవడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగారు. తొలిచిత్రం 'అప్పారావు నెల తప్పాడు' విడుదల కాకపోయినా డబ్బింగ్‌లో ప్రతిభ కనబర్చడంతో తరువాత ప్రేమకు స్వాగతం, స్టూడెంట్‌ నంబర్‌-1, నువ్వునేను తదితర సినిమాలలో వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. అక్కడ నుంచి ప్రారంభమైన మోహనరావు పయనం ఇక వెనుదిరిగి చూసుకునే అవసరమే లేకుండా చేసింది. అర్దరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా ఎప్పుడు పిలిచినా దర్శకులు, నిర్మాతలకు అందుబాటులో ఉండే అతను అతి తక్కువ కాలంలో అత్యంత బిజీ కళాకారుడిగా మారిపోయాడు.

గత దశాబ్దకాలంలో వచ్చిన చిత్రాలలో అత్యధిక సినిమాలకు ఆయన గాత్రదానం చేశారు. సహజంగా ఒక చిత్రంలో వచ్చే ఇరవై ముప్పై పాత్రలలో కనీసం మూడు, నాలుగింటికైనా ఆయనకు అవకాశం వచ్చేది. అలా ఒకటి కాదు...రెండు కాదు..పది కాదు...ఇరవై కాదు ఏకంగా 1500కుపైగా సినిమాల్లో వివిధ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పడం చిన్న విషయం కాదనేది అందరూ అంగీకరించాల్సిన సత్యం. ఇటీవల విడుదలయిన షిరిడీసాయి, బిజినెస్‌మెన్‌, గబ్బర్‌సింగ్‌, మిస్టర్‌ఫర్‌ఫెక్ట్‌, రెబల్‌ లాంటి సినిమాల్లోని అనేక పాత్రలకు గాత్రదానం చేశారు.

టీవీ సీరియళ్లకు సైతం
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ప్రతిభ, పనితీరును గుర్తించిన నిర్మాతలు టీవీ సీరియళ్లలోనూ అవకాశమిచ్చారు. అలా ఇప్పటివరకు వందకు పైగా సీరియళ్లలోని వివిధ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పారు. డిస్కవరీ(తెలుగు), టీవీ-5లో వచ్చే ధ్రువతారలు, టెలిబ్రాండ్స్‌తో పాటు వివిధ ఛానళ్లలో ప్రసారమవుతున్న మొగలిరేకులు, అగ్నిపూలు, మనుసు-మమత, చిన్నకోడలు, బంగారు కోడలు, ఇంద్రాణి, అభిషేకం, అపరంజి, కాంచనగంగ, అన్నాచెల్లెళ్లు, చంద్రముఖి, కుంకుమరేఖ, ముద్దుబిడ్డ, పుత్తడిబొమ్మ, గోరింటాకు, రాధాకళ్యాణం, పంచతంత్రం, మీరా, సిఐడి, చూపులు కలిసిన శుభవేళ తదితర సీరియళ్లలో ప్రస్తుతం ఎన్నో పాత్రలకు గాత్రదానం చేస్తున్నారు. ఉదయం ఇంటి నుంచి బయటపడితే స్టూడియోలు మారుతూ పనిపూర్తి చేసుకోవడానికి అర్దరాత్రి అయిపోతుందని మోహనరావు 'న్యూస్‌టుడే'కు చెప్పారు. ఆర్థికంగా కూడా ఈ రంగం ప్రోత్సాహకరంగా ఉండటంతో హాయిగా ముందుకు సాగుతున్నానన్నారు.

నంది avaarDu :
'మొగలిరేకులు' సీరియల్‌లో 'సెల్వ' పాత్రకు చెప్పిన డబ్బింగ్‌కు గానూ రాష్ట్రప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నంది అవార్డును ప్రకటించింది. ఉగాది రోజున హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నంది అవార్డును అందుకోనున్నారు. మరో విశేషమేమింటే ప్రస్తుతం అయిదోతరగతి చదువుతున్న కుమారుడు కార్తికేయను సైతం ఆయన డబ్బింగ్‌ రంగంలోనే ముందుకు తీసుకువెళుతున్నారు. భార్య పుణ్యవతి, సోదరులు ఉపేంద్ర, ప్రభాకర్‌, అక్క అనురాధ, బావ పాపారావుల ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన చెబుతుంటారు. మొత్తం మీద బతుకు తెరువు కోసం ప్రవేశించిన రంగమైనా చిత్తశుద్ధితో శ్రమించడం ద్వారా 'నంది' అవార్డు అందుకునే స్థాయికి చేరుకోగలిగారు.

చిక్కోలు వారికి ప్రోత్సహిస్తా
సినిమా, టెలివిజన్ల రంగాలు అంటే కేవలం బయటకు కనిపించే పాత్రలే అనుకోకూడదు. వెనుక పనిచేసే చాలామందిలో డబ్బింగ్‌ కళాకారులు ఒకరు. ఇటీవల కాలంలో టీవీ ఛానళ్లు, వాటిల్లో కార్యక్రమాలు విపరీతంగా పెరుగుతూ వస్తుండటంతో డబ్బింగ్‌ కళాకారులకు మంచి డిమాండ్‌ నెలకొంది. మనసుపెట్టి పనిచేస్తే తీరికలేనంత పని లభిస్తుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. చిక్కోలు నుంచి ఆసక్తిగల కళాకారులు వస్తే నా సహాయ సహకారాలు అందించేందుకు ఎప్పుడు సిద్ధమే.

- మొజ్జాడ మోహనరావు, సినీ, టీవీ సీరియళ్ల డబ్బింగ్‌ ఆర్టిస్టు @Eenadu Srikakulam edition 20121120.

  • ===================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Monday, November 5, 2012

Yagalla Ramakrishna Death-యగళ్ల రామకృష్ణ మరణం.




సాహితీ సేవకుడికి (యగళ్ల రామకృష్ణ) ప్రముఖుల నివాళి-భౌతికకాయాన్ని రిమ్స్‌కు అప్పగింత. తుదిశ్వాస వరకు తెలుగు సాహిత్యం, సంస్కృతి గురించే  తపించిన కళా తపస్వి.. అభ్యుదయ వాదాన్ని జపించి నిజజీవితంలోనూ ఆచరించిన మానవతా వాది. ఉత్తరాంధ్ర భోజుడుగా బాపూరమణలు కీర్తించిన కళా పోషకుడు.. సాహితీ సేవకే జీవితాన్ని అంకితం చేసిన మహామనిషి యగళ్ల రామకృష్ణ ఇక లేదు. ఆయన యగళ్ల రామకృష్ణవార్త విని సాహితీ లోకం కన్నీరుపెట్టింది. బెంగళూరులో ఉన్న ఆయన భార్య డా. పద్మ, కుమార్తె లాలసలు ఆయన మరణవార్త విన్న వెంటనే బయలుదేరి గురువారం(25/10/2012) శ్రీకాకుళం చేరుకున్నారు. ఆయన కుమారుడు వేణు అమెరికాలో ఉంటున్నారు. ఆయన భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఎం.పి. కణితి విశ్వనాథం, కథానిలయం వ్యవస్థాపకులు కారా మాస్టారు, విరసం చలసాని ప్రసాద్‌, దాసరి
రామచంద్రరావు, మునికోటి సత్యనారాయణ, బంధువులు, స్నేహితులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రామకృష్ణ భౌతికకాయాన్ని రిమ్స్‌ ఆసుపత్రికి దానం చేశారు.

 రిమ్స్‌లో 'యగళ్ల'కు శ్రద్ధాంజలి--కవి, కథకులు, సాహితీ విమర్శకులు దివంగత యగళ్ల రామకృష్ణ శ్రద్ధాంజలి కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 గంటలకు రిమ్స్‌ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతుందని, ఆయనతో అనుబంధం ఉన్న ప్రముఖుల సమావేశం నిర్ణయించింది. గురువారం న్యూకాలనీలో ప్రెస్‌ అకాడమీ పాలకవర్గ సభ్యులు నల్లి ధర్మారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాళీపట్నం రామారావు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్ర భోజుడు రామకృష్ణ--సౌజన్యశీలిగా, ఉత్తరాంధ్ర భోజుడిగా యగళ్ల ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు యగళ్ల రామకృష్ణ మృతి సాహితీ లోకానికి తీరని లోటు అని కథానిలయం వ్యవస్థాపకులు డా. కాళీపట్నం రామారావు మాస్టారు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. కథానిలయం వ్యవస్థాపక సభ్యులు  ముగ్గురులో ఆయనొకరని తెలిపారు. శ్రీకాకుళ సాహితీ సంస్థకు మొదట్నుంచి ఆర్థిక, హార్థిక సహాయం చేసిన రామకృష్ణ ఉత్తరాంధ్ర సాహితీ ఉన్నతికి  తోడ్పడ్డారని శ్రీకాకుళ సాహితీ సంస్థ డా. బి.వి.ఎ.రామారావునాయుడు తెలిపారు. సాహితీవేత్త యగళ్ల రామకృష్ణ మృతి సాహితీలోకానికి తీరని లోటని  కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు అన్నారు. గురువారం స్థానిక డిసీసీబీ కాలనీలోని యగళ్ల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి  ఓదార్చారు.

యగళ్ల మృత దేహాన్ని వైద్యవిద్యార్థుల ప్రయోగాలకు వినియోగించుకునేందుకు వీలుగా శుక్రవారం (26 October 2012)ఉదయం అధికారికంగా  యగళ్లకుటుంబ సభ్యులు వైద్యకళాశాలకు అప్పగిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎం.పి. డాక్టర్‌ కిల్లి కృపారాణి తదితరులు  పాల్గొంటారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారి సమక్షంలోఎంబాల్మింగ్‌ చేయబడిన పార్థివ శరీరాన్ని కుటుంబ సభ్యులు అందజేస్తారు.

--Courtesy with : శ్రీకాకుళం(సాంస్కృతిక), గుజరాతీపేట, న్యూస్‌టుడే
  • ======================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Wednesday, September 26, 2012

Majji Narayanarao-మజ్జి నారాయణరావు

  •  
  •  
నాలుగు దశాబ్దాలపాటు జిల్లా రాజకీయాల్లో తనదంటూ ముద్రవేసి, జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుల్లో ఒకరైన మజ్జి నారాయణరావు జిల్లా కాంగ్రెస్‌లో చెరగని రాజకీయముద్రవే్సారు . వ్యూహప్రతివ్యూహాల్లో దిట్ట.
వ్యూహప్రతివ్యూహాలు, రాజకీయ ఎత్తులు వేయడంలో దిట్టగా పేరుగాంచిన నారాయణరావు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్నకు ప్రత్యర్థిగా రాజకీయాలు నడిపారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రముఖ నాయకునిగా వెలుగొంది పాత సోంపేట నియోజకవర్గంలో గౌతు కుటుంబానికి చిరకాల ప్రత్యర్ధిగా వ్యవహరించడమే కాకుండా జిల్లాలో కాంగ్రెస్‌కు జవజీవాలు అందించడంలో నారాయణరావు ప్రధానపాత్ర పోషించారు. కొంతకాలంగా అస్వస్థతతో ఇబ్బంది పడుతూ సొంత గ్రామమైన సోంపేట మండలం పాత్రపురం లోనే ఉంటున్న ఆయన
మంగళవారం 25/09/2012 అర్ధరాత్రి కన్నుమూశారు.  బుధవారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో సొంత గ్రామం పాత్రపురంలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి.నాయకులు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు.


జులై 4, 1937లో జన్మించిన మజ్జి నారాయణరావు డిగ్రీ చదివిన తరువాత పెద్దన్నయ్య వద్ద ఉంటూ ఎయిర్‌ఫోర్సుతోపాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలలో ఉద్యోగాలు చేశారు. మూడో అన్నయ్య మజ్జి తులసీదాసు రాజకీయాల్లో రాణించడం, రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయాల్లో బిజీ కావడంతో తన వారసునిగా సోంపేట నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు నారాయణరావుని  తీసుకొచ్చారు. 1962లో నారాయణరావు రాజకీయాలలో ప్రవేశించి రాజకీయ కురువృద్దుడు సర్దార్‌ గౌతు లచ్చన్నకు ప్రత్యర్థిగా వ్యూహాలు అమలు జరిపేవారు.

డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ చదివిన ఆయన న్యాయవాదిగా సోంపేట కోర్టులో ప్రాక్టీసు చేస్తూనే రాజకీయాల్లో అన్న తులసీదాసుకు అండదండలందించేవారు. తులసీదాసు మందసలో నివాసం ఉండి ఆ ప్రాంత రాజకీయాలు పరిశీలిస్తే నారాయణరావు సోంపేటలో నివాసం ఉంటూ ఈ ప్రాంత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి గౌతు కుటుంబానికి కంచుకోటగా ఉన్న పాత సోంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని కాపాడడంలో ఆయన పాత్ర ప్రధానమైనది. 1972లో అన్నను గెలిపించడంతోపాటు ఆ తరువాత జరిగిన  ఎన్నికల్లో లచ్చన్నకు కాంగ్రెస్‌ గట్టిపోటీ ఇచ్చే విధంగా నియోజకవర్గాన్ని  తీర్చిదిద్దారు. కొన్ని ప్రత్యేక కారణాల నేపథ్యంలో జనతాపార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఏడాది మినహాయిస్తే మిగిలిన కాలమంతా కాంగ్రెస్‌ పార్టీలోనే నారాయణరావు కొనసాగారు. 1983లో తెదేపా ఆవిర్భావం తరువాత ఎన్టీఆర్‌ హవాలో ఉత్తరాంధ్ర మొత్తాన కాంగ్రెస్‌ పార్టీ పరాజయం పాలుకాగా ఒక్క సోంపేటలో మాత్రం నారాయణరావు గెలుపొంది రాష్ట్రంలో ప్రత్యేకత చాటుకున్నారు. 1983లో సోంపేటలో జరిగిన ముక్కోణ పోటీలో లోక్‌దల్‌ తరఫున పోటీచేసిన రాజకీయ కురువృద్ధుడు సర్దార్‌ గౌతు లచ్చన్నను ఓడించడం ద్వారా నారాయణరావు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి ఎన్నికల్లో తెదేపా తరఫున బి.సత్యవతి పోటీచేశారు. ఆ తరువాత జరిగిన కుటుంబ వివాదాల నేపథ్యం, ఇతర అంశాల మూలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. 1989లో పోటీ చేసినప్పటికీ అంతర్గత కుమ్ములాట ఫలితంగా  ఆయన ఓటమిపాలయ్యారు. మామిడిపల్లి సర్పంచిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన నారాయణరావు మందస సమితి అధ్యక్షునిగా రెండుసార్లు, కోర్టులో కేసు వేసి గెలవడం ద్వారా మందస ఎంపీపీగా ఒకసారి  ఆయన పనిచేశారు. జిల్లా కేంద్రబ్యాంకు డైరెక్టర్‌గా, ఫిలిం సెన్సార్‌బోర్డు సభ్యునిగా, ఆర్టీసీ జోనల్‌ ఛైర్మన్‌గా సేవలందించారు. పీసీసీ, డీసీసీల్లో కూడా పలు పదవులు నిర్వహించడమే కాకుండా  దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి ప్రధాన అనుచరునిగా గుర్తింపు పొందారు. ఆయన ఆశించినస్థాయిలో రాజకీయ ప్రస్థానం 
కొనసాగలేదు. అయినప్పటికీ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని బలంగా నిర్మించినవారిలో ఆయన పాత్ర ప్రధానమైందని చెప్పవచ్చు. 2004 తరువాత వై.ఎస్‌.ఆర్‌. అధికారం చేపట్టడంతో నారాయణరావు రాజకీయ ఎదుగుదల బాగుంటుందని అంతా   భావించినప్పటికీ 2009లో నియోజకవర్గ  పునర్వవస్థీకరణతో పరిస్థితి తిరగబడింది. ఆర్ధికంగా, ఇతర విధాలుగా కూడా ఆయన ఇబ్బందులు పడ్డారు. నారాయణరావు పెద్దన్నయ్య కుమార్తెల్లో ఒకరు ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కాగా ఇంకొకరు కణితి లలితాదేవి మాజీ ఎంపీ కణితి విశ్వనాథం భార్య కావడం విశేషం. మరో అన్న తులసీదాసు కుమార్తె మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నారాయణరావుకు భార్య  పార్వతితోపాటు కుమార్తె సుధాబాల, కుమారుడు రాంబాబు ఉన్నారు.

  • ===================
Visit my website -> Dr.seshagirirao-MBBS